ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్లను షేక్ చేసాయి. ఎన్నో సూపర్ హిట్ విజయాలను అందుకున్న బాలీవుడ్ టౌన్ కొంత కాలంగా మాత్రం సరైనా హిట్ కొట్టలేకపోతుంది. చిన్న హీరోల సినిమాలే కాదు స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ల వద్ద దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతం నార్త్ లో హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాల హవానే నడుస్తుంది. అంతే కాకుండా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన దక్షిణాది సినిమాలు భారీ కలెక్షన్లను సునాయాసంగా రాబట్టగలుగుతున్నాయి.
అనురాగ్ కశ్యప్ కామెంట్స్
ప్రస్తుతం బాలీవుడ్ని సౌత్ ఇండియా సినిమాలు తొక్కేస్తున్నాయి. దాదాపు స్టార్ హీరోల సౌత్ మూవీస్ అన్నీ నార్త్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. కానీ హిందీ సినిమాలు ఎందుకు హిట్ అవడం లేదు. ఈ విషయంపై ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యన్ షాకింగ్ కామెంట్స్ చేసారు. అనురాగ్ కశ్యన్ మాట్లాడుతూ “హిందీ రాని వాళ్లు కూడా హిందీలో సినిమాలు తీస్తున్నారు. ఇదే బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్లు రాకపోవడానికి ముఖ్య కారణం. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు చూసినప్పుడు నటీనటులు వారి సంస్కృతిలో జీవించేస్తారు. వారికి వారి సంస్కృతి, భాషపై పట్టు ఉంటుంది. కానీ బాలీవుడ్ లో హిందీ రాకుండా కేవలం ఇంగ్లీష్ వచ్చిన వాళ్లే సినిమాలు తీస్తున్నారు. ఇది సినిమాపై ప్రభావం చూపిస్తుంది. భాష రాని వాళ్లు సినిమా తీస్తే… కథ ఏం అర్ధం చేసుకుంటారు.?” అని చెప్పుకొచ్చాడు.
మరి వివరాలివే
“ఈ రీసెంట్ టైమ్స్లో గంగుబాయి కతీయావాడి, భూల్ భూలయ్య 2 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఎందుకంటే ఆ రెండు సినిమాల నిర్మాతలు సాధారణంగా చేసే సినిమాలే చేసారు. కానీ కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సరికొత్తగా సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత కొత్తగా ప్రయత్నించినా భాష, సంస్కృతి పై పట్టు లేన్నపుడు ప్రయోజనం ఏముంది ” అని అన్నారు. 20 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో రానిస్తున్న అనురాగ్ బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్ అఫ్ వస్సేపూర్, డెవ్ డీ వంటి సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం దో బర మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించనుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!