Anushka : అనుష్క ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పబోతోందా.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అనుష్క కెరీర్లో అరుంధతి సినిమా తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంకతక ముందు భాగమతి అన్న సినిమా చేసింది.
ఈ సినిమాతో అనుష్క సూపర్ హిట్ ని అందుకుంది. జి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించారు. మీడియం బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా మేకర్స్ మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
అంతేకాదు అనుష్క కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా లాక్డౌన్ సమయంలో అనుష్క నటించిన నిశ్శబ్దం ఓటీటీలో రిలీజై ప్రేక్షకకులను మెప్పించలేకపోయింది. అనుష్కని కూడా ఈ సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మళ్ళీ ఇప్పటి వరకు అనుష్క కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. అభిమానులు మాత్రం అనుష్క నుంచి మళ్ళీ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పలు రకాల వార్తలైతే సోషల్ మీడియాలో వస్తున్నప్పటికి అఫీషియల్ గా మాత్రం అనుష్క నటించే సినిమా ఏంటన్నది క్లారిటీ లేదు.
Anushka : అనుష్కతో భాగమతి సీక్వెల్ ని ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారో..?
కాగా తాజా సమాచారం ప్రకారం అనుష్క తో యూవీ వారు భాగమతి సినిమాకి సీక్వెల్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. భాగమతి 2 గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియనప్పటికి ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో అలాగే ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్గా మారింది. చూడాలి మరి మేకర్స్ అనుష్కతో భాగమతి సీక్వెల్ ని ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారో.