కరోనా దెబ్బకి థియోటర్స్ మూత పడితే ఓటిటిలు మాత్రం ఊపందుకున్నాయి. మంచి ఆఫర్ వస్తే మేకర్స్ ఎక్కడైనా ఒకటే జానాలు సినిమాలు చూడటం ముఖ్యం అని మేకర్స్ కన్విన్స్ అయ్యారు. అందుకే అన్ని భాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలన్ని అవకాశాన్ని బట్టి మంచి ఆఫర్ వస్తే రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇటీవలే నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమా రిలీజై ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.
అలానే టాలీవుడ్ లో తెరకెక్కిన క్రేజీ మూవీ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్దం” కూడా రిలీజ్ కాబోతుంది. టాలెంటెడ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మిచారు. మొత్తం నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులే కాదు అనుష్క కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
అంతేకాదు ఇపుడు అందరూ ఈ సినిమా డిజిటల్ రిలీజ్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలతో ఓటిటిలో రిలీజయ్యాయి. అయితే ఆ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చిన్న సినిమాలు కాస్తో కూస్తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
అందుకే ఇప్పుడు అందరు అనుష్క నిశ్శబ్ధం సినిమా గురించే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అయినా హిట్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా చూడాలి. ఈ సినిమాలో మాధవన్, షాలిని పాండే, అంజలి కీలక పాత్రల్లో నటించారు. కోనవెంకట్ నిర్మాణంలో రూపొందించారు. అక్టోబర్ 2 న నేరుగా ఓటిటి లో రిలీజ్ కి రెడీగా ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!