రెబెల్ స్టార్ ప్రభాస్, స్వీటీ అనుష్క రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిల్లా సినిమాలో వీరిద్దరూ కలిసి మొదట నటించారు. అప్పుడే వీరిద్దరి పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత మిర్చి సినిమాతో వీరిద్దరి రిలేషన్ వేరే లెవెల్ కు వెళ్ళింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీకు ప్రేక్షకుల వైపు నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక బాహుబలి 1 అండ్ బాహుబలి 2 లో కూడా వీరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అసలు పెయిర్ అంటే ఇలా ఉండాలి అనేలా ప్రభాస్, అనుష్కలు కలిసి ఆయా సినిమాల్లో నటించారు. అయితే ఈ నాలుగేళ్లు కలిసి నటించే క్రమంలో వీరి రిలేషన్ పై రకరకాల రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అందరూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అన్నారు.
ఎన్ని సార్లు వీరిద్దరూ కలిసి ఈ రూమర్స్ ను ఖండించినా అవి ఆగలేదు. ఇదిలా ఉంటే అనుష్క శెట్టి ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆమె ట్వీట్స్ వేస్తోంది. మొన్న నిశ్శబ్దం రిలీజ్ సందర్భంగా కూడా అనుష్క ఈ సినిమా చూస్తున్నట్లు తన పెంపుడు కుక్కతో ఫోటోను పెట్టింది.
ఈ నేపథ్యంలో ఒక ట్విట్టర్ యూజర్ అనుష్క, ప్రభాస్ ల పెళ్లి ఫోటోలాంటిది ఒకదాన్ని అనుష్కకు పోస్ట్ చేసి దాన్ని గురించి స్పందించమని అడిగాడు. అయితే దానికి అనుష్క, “సీన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు తీసిన ఒక కాండీడ్ పిక్ ఇది. నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ఇది” అంటూ అనుష్క స్పందించింది. అయితే ఈ పోస్టర్ సినిమాలో ఉండదు. మిర్చి టీమ్ ప్రమోషన్స్ కోసం ఈ పిక్ ను వాడుకుంది.