AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు పరమయ్యాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సంతాప తీర్మానం పై మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. గౌతమ్ రెడ్డి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మంచితనాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు కొనియాడారు. తీర్మానంపై అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది.
అదేవిధంగా 10 గంటలకు శాసనమండలిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. సంతాప తీర్మానం పై చర్చ అనంతరం శాసన మండలి వాయిదా పడనుంది. శాసనసభ సమావేశాలు 25 వరకు నిర్వహించాలని నిన్న జరిగిన బి ఏ సి సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. 9వ తేదీ గౌతం రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. పదవ తేదీన గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద్ తీర్మానం, చర్చ జరగనుంది.