(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
నాడు వాస్తు పేరిట, నేడు భద్రతా చర్యల పేరుతో సచివాలయం, అసెంబ్లీకి చెందిన మొత్తం అయిదు గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. గతంలో వాస్తు దోషాల పేరుతో అసెంబ్లీ గేట్ 5, సచివాలయం ఉత్తర, దక్షిణ గేట్లకు అడ్డంగా గోడలు కట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో రెండు గేట్లను మూసివేసి గోడ కట్టేశారు. ఈ ఏడాది జనవరి 20వ తేదీన చలో అసెంబ్లీ పిలుపులో భాగంగా అమరావతి రైతులు సిఎం బ్లాక్ 1 వద్దకు చేరుకున్నారు.
సచివాలయం గేట్ 1, అసెంబ్లీ గేట్ 2లకు అటు, ఇటు అధికారులు గోడ కట్టించారు. గతంలో మూడు, ఇప్పుడు రెండు గేట్లు మొత్తం అయిదు గేట్లకు శాశ్వతంగా మూసివేసినట్లు అయ్యింది. దీనిపై జెఎడి అధికారులు మాత్రం భద్రతా కారణాల కారణంగానే గేట్లను మూసివేసినట్లు చెబుతున్నారు. వాస్తు, భద్రతా కారణాలను సాకుగా చూపి ప్రవేశ ద్వారాలను మూసివేస్తుండటంపై పలువురు ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?