ఏపి శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి అంశంగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మాజీ ఉప రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్తో సహా పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానాలు ఆమోదించారు. వారి మృతికి సభ్యులు సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం కొద్దిసేపు విరామంతో సభను స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు. స్పీకరం తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో సమావేశ అజెండా ఖరారు చేసేందుకు బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ రోజు సమావేశాల్లో 11 అర్డినెన్స్లను రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది.
ఏపి ఫిస్కర్ రెస్పాన్స్ బిలిటీ అండ్ బడ్జెట్ (సవరణ) ఆర్డినెన్స్ 2020, ఏపి స్టేట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆర్డినెన్స్, ఏపి పంచాయతీరాజ్ (సవరణ) రెండో ఆర్డినెన్స్, ఏపి గేమింగ్ (సవరణ) ఆర్డినెన్స్ తదితరాలు వీటిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.