కరోనా వైరస్ కారణంగా అప్పట్లో జరగాల్సిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. వైరస్ ప్రభావం మరియు లాక్ డౌన్ ఎఫెక్టుతో అప్పట్లో ప్రభుత్వం సమావేశాలను వాయిదా వేయడం జరిగింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం రేపటి నుండి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం టీడీపీ పార్టీకి చెందిన నాయకులు వరుసగా వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేస్తున్న తరుణంలో మొదటిరోజు అసెంబ్లీ సమావేశాలకు నిరసనగా అదిరిపోయే ఎంట్రీ ఇవ్వడానికి టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు.
టీడీపీ నాయకులు అక్రమ అరెస్టులకు నిరసనగా అధ్యక్షుడు చంద్రబాబు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు నల్ల చొక్కాల తో రావాలని టీడీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ నేతలకు సూచించారు. రెండు రోజులు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు అధికార పార్టీ వైసీపీ ని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో.. రాష్ట్రం లో వరుస అక్రమ అరెస్టులు, ఇసుక మాఫియా, మద్యం ధరలు, విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నిలదీయాలని టీడీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోపక్క వైసీపీ కూడా టీడీపీ వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?