స్పీకర్ వ్యవస్థపై రకరకాల భిన్న స్వరాలు వినిపిస్తుంటాయి! స్పీకర్ అధికారపక్షం వైపే మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలను కన్నెత్తి చూడనివ్వడం లేదని, నోరెత్తి మాట్లాడనివ్వడం లేదని విమర్శలు వస్తుంటాయి. ఈ విషయంలో గతంలోని కోడెల శివప్రసాద్ పై వచ్చిన విమర్శలతో పోలిస్తే తమ్మినేని కాస్త జాగ్రత్త పడుతున్నారనే అనుకోవాలి. ఆ సంగతి అలా ఉంచితే.. తాజాగా ఆయన ద్విపాత్రాభినయంపై క్లారిటీ ఇచ్చారు!
అసెంబ్లీలోనే.. ఆ కుర్చీ ఎక్కిన సమయంలోనే తాను స్పీకర్ ని అని, అనంతరం తన నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యేని అని.. ఆ విషయం మీడియా మరిచిపోకూడదని చెబుతున్నారు తప్పినేని సీతారాం. సీఎం జగన్ దయతోనే ఎమ్మెల్యే అయ్యానని నిత్యం చెప్పే ఆయన… మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఆముదాలవలసలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన ఆయన… “తాను వైసీపీ ఎమ్మెల్యేని.. వైసీపీలో ప్రాథమిక సభ్యుడిని.. అలాంటి నేను వైఎస్ జయంతి నిర్వహించకపోతే ఎలా?.. స్పీకర్ అంటే మూతి ముడుచుకుని కూర్చోవాలా.. అలా అయితే నియోజకవర్గ ప్రజల పనులు ఎవరు చేస్తారు..” అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇదే క్రమంలో బయట ఎన్ని మాట్లాడినా, పార్టీకి ఎంత మద్దతుగా ఉన్నా కూడా… అసెంబ్లీలో మాత్రం నూటికి నూరు శాతం సభాపతిని అన్న విషయం స్పష్టం చేశారు తమ్మినేని.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?