అమరావతి, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం నుండి వివిధ రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొన్నారు. ఈ బంద్కు టిడిపి, కాంగ్రెస్, వామపక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టిసి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.
విజయవాడలోని జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్ వద్ద హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరహరిశెట్టి నర్శంహారావు, సుంకర పద్మశ్రీ, సిపిఐ నాయకుడు దొనెపూడి శంకర్ తదితర నేతలు నిరసనకు దిగారు. రాజమహేంద్రవరంలో సిపిఐ, గుంటూరులో కాంగ్రెస్, సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్ వద్ద వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోరుతూ చేపట్టిన ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న కార్యకర్తలు, నేతలను పోలీస్లు అరెస్టు చేసి స్టేషన్కు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి బస్సు సేవలకు కొంత అంతరాయం ఏర్పడింది.
బంద్కు సంఘీభావంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీ సమావేశానికి హజరయారు. లారీ ఓనర్స్ అసోసియేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రైవేటు విద్యాసంస్థలు, కళాశాలల సంఘాలు కూడా బంద్కు సంఘీభావం తెలిపాయి. బంద్ సందర్భంగా జరిగే ర్యాలీలు, నిరసన ప్రదర్శనల్లో టిడిపి నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి పాల్గొంటున్నారు. ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హజరవుతున్నట్లు అమరావతి ఉద్యోగ జెఎసి నేతలు తెలిపారు. ఎపిఎన్జివో సంఘం బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
బంద్కు వైసిపి, జనసేన, బిజెపి దూరంగా ఉన్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?