AP: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని సమూలంగా మార్చేసిన సంగతి తెలిసిందే. గతంలో మద్యం షాపులకు ఉన్న ఆక్షన్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తొంది. అప్పట్లోనే రాష్ట్రంలో బార్ల నిర్వహణకు సంబంధించి కూడా న్యూ పాలసీ తీసుకురావాలని ప్రయత్నం చేసింది కానీ బార్ లకు గత ప్రభుత్వ హయాంలోనే 2022 జూన్ నెలాఖరు వరకూ లైసెన్స్ లు మంజూరు చేసి ఉండటంతో సాధ్యం కాలేదు. ఈ నెలాఖరు నాటికి బార్ లైసెన్సుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని బార్లకు న్యూ పాలసీని ప్రకటించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పోరేషన్ లు, నగర పంచాయతీల పరిధిలో ఎన్ని బార్లు ఉండాలన్నది ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారు. మున్సిపల్ కార్పోరేషన్ లో పది కిలో మీటర్ల పరిధిలో, మున్సిపాలిటీల్లో మూడు కిలో మీటర్ల పరిధిలో బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్లకు లైసెన్సులు మంజూరు చేస్తారు. బార్లకు లైసెన్సు ఫీజుతో పాటు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలు ఏడాదికి పది శాతం పెంచనున్నారు. కొత్త బార్ పాలసీ సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ బార్ ల పాలసీ సెప్టెంబర్ 1 నుండి అమలు చేయనున్నందున ప్రస్తుతం ఉన్న బార్ లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా ఉత్తర్వులతో బార్ల లైసెన్సు కాలపరిమితిని జూలై 1 నుండి ఆగస్టు 31 వరకూ పొడిగించారు. లైసెన్సు పొడిగించిన రెండు నెలల కాలానికి బార్ల నుండి ఫీజును ఈ నెల 27వ తేదీన ప్రభుత్వం వసూలు చేయనుంది.