అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తెలుగు మీడియం,ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకం కాదని, అయితే భాషా, సంస్కృతిని కాపాడాలని అన్నారు. భాషను బలవంతంగా రుద్దవద్దని కన్నా హితవు పలికారు.
ప్రభుత్వ పరంగా తెలుగుని విస్మరిస్తాం అంటే కుదరదనీ, భాషను ఎంచుకొనే ఆప్షన్ విధానం పెట్టాలనీ ఆయన అన్నారు.
ఆంగ్ల భాష అమలు వెనుక మతపరమైన కుట్ర ఉందని కన్నా ఆరోపించారు. ఒక మతాన్ని ప్రోత్సాహించేందుకు ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు. అమ్మకు, మమ్మికి మధ్య ఉన్న తేడాతో మొత్తం సంస్కృతి మారిపోతుందని కన్నా అన్నారు.