గుంటూరు: అనవసర విషయాలపై అత్యుత్సాహం చూపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇసుక పాలసీ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
గుంటూరులో నేడు మీడియా సమావేశంలో వైసిపి ప్రభుత్వ తీరుపై ఆయన మరో మారు విమర్శలు గుప్పించారు. వైసిపి ప్రభుత్వానికి ఆత్రం తప్ప పనిలో శ్రద్ధ లేదని కన్నా విమర్శించారు. సిఎం జగన్ చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదని కన్నా వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఇసుక సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారనీ, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. రాష్ట్రంలో టిడిపి, బిజెపి కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.