హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు నల్లపురెడ్డి సుహారిక అనుమానాస్పదంగా మృతి చెందారు. మాదాపూర్లోని మీనాక్షి టవర్స్లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుహారిక అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్పించేలోపే మార్గమధ్యలోనే సుహారిక మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్టు సమాచారం.
previous post