బిజెపి పార్టీలో మోడీ మాటకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటి మోడీ తీరు గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసింది ఏపీ రాజధాని అమరావతి మ్యాటర్. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ తీసుకున్న నిర్ణయానికి అమరావతి రాజధాని రైతులు అదేవిధంగా కొన్ని కీలక పార్టీలు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో విభేదించడం జరిగింది.
ఈ క్రమంలో జగన్ 3 రాజధానుల నిర్ణయం విషయంలో ఏపీ బీజేపీ అప్పట్లో రాజధాని వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అని చెప్పుకుంటూ రావటం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేశారు. మూడు రాజధానులు నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని ప్రధాని మోడీ మనిషిగా తాను ఈమాట చెబుతున్నానని, నేను చెప్పిన మోడీ చెప్పిన ఒకటే అన్నట్టు వ్యాఖ్యానించారు.
నూతన వ్యవసాయ బిల్లులకు మద్దతుగా అమరావతిలో భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అమరావతి రాజధాని అని బీజేపీ గుర్తించడం జరిగిందని అందువల్లే మంగళగిరి ఈ ప్రాంతానికి ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరిగిందని సోము చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అమరావతి రాజధాని కాబట్టి ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలో నిర్మిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానులు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేమని చెప్పినా గానీ అమరావతి విషయంలో మాత్రం బీజేపీ సపోర్ట్ ఫుల్ గా ఉంటుందని సోము తెలిపారు.