ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తరువాత ఏపీ రాజకీయాల్లో బీజేపీ పేరు డబల్ త్రిబుల్ అయింది. ప్రతిపక్షం పార్టీ టీడీపీ చేయని రీతిలో ప్రభుత్వం పై బిజెపి ఆధ్వర్యంలో అతి తక్కువ కాలంలోనే పోరాటానికి తెగబడింది. దేవాలయాల పై దాడుల విషయంలో గాని మరి కొన్ని విషయాల్లో గాని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ కంటే చాలా యాక్టివ్ గా ఉంది. ఇదిలా ఉండగా పార్టీలో కోవర్టులు కు చెక్ పెట్టే రీతిలో బిజెపి చేస్తున్న ప్రయోగం బెడిసికొడుతున్నట్లు ఏపీ మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.
ఏపీ బీజేపీ లో ఉన్న నాయకులు ఎవరికి వారు ఇష్టానుసారంగా మీడియా ముందు తమ అభిప్రాయాలను హైకమాండ్ కి చెప్పకుండానే మాట్లాడే పరిస్థితులు ఇటీవల ఏర్పడటంతో… మీడియాతో మాట్లాడే వారి నాయకుల పేర్లు ఒక జాబితాగా తయారుచేసి బీజేపీ హైకమాండ్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో బిజెపి పార్టీ తరఫున ఎప్పటినుండో వాయిస్ వినిపిస్తున్న వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో.. బిజెపి అస్త్రాలు బెడిసి కొట్టినట్లు కనబడుతోంది. పార్టీ తరఫున టీవీ చర్చలో వీళ్లే పాల్గొనాలి, వీరిని మీడియా పిలవాలి అంటూ తాజాగా ఓ జాబితా రిలీజ్ చేసింది బిజెపి.
అందులో అధికార ప్రతినిధుల తో సహా వివిధ పదవుల్లో ఉన్న 25 మందికి చోటు కల్పించారు. ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీలో రచ్చరచ్చ అవుతుంది. ఈ జాబితా వెనుక పెద్ద కథే ఉన్నట్లు సమాచారం. టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే వారిలో వేరే పార్టీకి సంబంధించిన కోవర్ట్ లు ఉన్నట్లు అనే అనుమానం అధిష్టానానికి ఎప్పటినుండో ఉందట. బీజేపీ పార్టీ పేరు తో చర్చలకు వెళ్తున్న సదరు నేతలు వేరే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని వారికి అనుకూలంగా వాయిస్ వినిపిస్తున్నారని గుర్తించడం జరిగిందట. అలాంటివారికి కత్తిర వేయడానికి అధికార పేర్ల జాబితాను… అధికారికంగా బిజెపి నేతలు విడుదల చేశారట.
ఇలాంటి తరుణంలో ఎప్పటినుండో బిజెపి పార్టీ తరఫున వెళుతున్న కొంతమంది కీలక నాయకుల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం తో… చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే రీతిలో కోవర్టుగా పార్టీ అనుమానిస్తున్న ఒకరిద్దరి పేర్లు జాబితాలో ఉన్నాయట. ఇదే గందరగోళానికి దారి తీసింది. అదేవిధంగా వివాదాలు సృష్టించే విధంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈలోపే మీడియా ముందు వెళ్లే మాట్లాడాలని తీసుకొచ్చిన జాబితా మరింతగా ఏపీ బిజెపి నేతలకు హైకమాండ్ పై కీలక నాయకులపై లో లోపల అసహనం చెబుతున్నట్లు సమాచారం