జగన్ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెడుతున్న బడ్జెట్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా సంక్షోభానికి ముందు అనుకున్న బడ్జెట్ నే జగన్ ఇప్పుడు కూడా ప్రవేశపెడుతుండడం ఆశ్చర్యం. అయితే ఆ ఎఫెక్ట్ ఏమాత్రం రాష్ట్రంపై పడనివ్వబోమని కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ సమయంలో రాష్ట్ర అభివృద్ధిలో కొన్ని కీలక రంగాల వ్యవసాయం, విద్య, వైద్యం వంటి అనేక వాటికి జగన్ ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ఒకసారి చూద్దాం.
* వ్యవసాయానికి 1191 కోట్లు
* విద్యకు 22604 కోట్లు
* వైద్య రంగానికి 11419 కోట్లు
* వడ్డీలేని రుణాల కోసం 1100 కోట్లు
* సోషల్ వెల్ఫేర్ 12,465.85 కోట్లు
* రెవిన్యూ రంగానికి 7964 కోట్లు
* పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 16,710 కోట్లు
* జల వనరులు 11,805 కోట్లు
* పెట్టుబడులు మౌలిక వసతులు 696.62 కోట్లు
* హోమ్ శాఖ 5988.72 కోట్లు
* మూల ధన వ్యయం 44,396 కోట్లు