అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 14 పని దినాల పాటు నిర్వహించాలని బిఏసిలో నిర్ణయించారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బుధవారం జరిగిన బిఏసి సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, టిడిపి నేత అచ్చెన్నాయుడు తదితరులు హజరయ్యారు. మొత్తం 14 పని దినాల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెలవులతో కలిపి ఈ నెల 30వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 12వ తేదీన అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కె కన్నబాబు ప్రవేశపెడతారు.
previous post