రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో 3, 7 సెక్షన్ లను సవరణ చేస్తూ కేబినేట్ లో నిర్ణయం
- పగటిపూట 9గంటల విద్యుత్ రైతులకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కేబినేట్ లో చర్చ
- ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కరువు నివారణ అభివృద్ది ప్రాజెక్ట్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయడంపై కేబినేట్ లో చర్చ
- గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిధులు పరిహారం కేటాయింపు పై కేబినేట్ లో చర్చ
- మరో రెండు వేల కోట్ల రూపాయల లోను తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీతో ఏపిఐఐసికి అనుమతి
- ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే అంశంపై కేబినేట్ లో చర్చ.
- నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి పై మంత్రి వర్గంలో చర్చ
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కివ్స్ డిపార్ట్ మెంట్ లో ఒక పోస్ట్ క్రియేట్ చేస్తూ కేబినేట్ లో ఆమోదం.
- 420 టీచర్ పోస్టులను, 178 నాన్ టీచింగ్ పోస్ట్ లను శ్రీకాకుళం, ఒంగోలులో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ క్నోలెడ్జి అండ్ టెక్నాలజీ లో పోస్టులు క్రియేట్ చేస్తూ కేబినేట్ అమోదం తెలిపే అవకాశం.
- 31 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించేందుకు కేబినేట్ లో నిర్ణయం.
- సిఐడి విభాగంలో 9జూనియర్ స్టెనోలను, 10 జూనియర్ అసిస్టెంట్లను, 10 టైపిస్ట్ ల పోస్టింగ్ లను ఏర్పాటు చేస్తూ కేబినేట్ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ యాక్ట్ ఆర్డినెన్స్ 2020 జారీకి కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం.
- డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీలో 17పోస్టులకు అనుమతిస్తూ కేబినేట్ లో అమోదం.
- ఐదు కోట్లతో కర్నూలు జిల్లాలో గొర్రెల పెంపక శిక్షణాకేంద్రం ఏర్పాటు చేసేందుకు కేబినేట్ లో చర్చ.
- తొమ్మిదిన్నర కోట్లతో కర్నూలు జిల్లాలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు కేబినేట్ లో అమోదం.
- ఆచార్య ఎన్ జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు హోం సైన్స్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్ల ఏర్పాటుకు కేబినేట్ లో అమోదం.
- వైఎస్ఆర్ చేయూత పథకం అమలు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం
- మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చ
- గతంలో జలవనరులశాఖ ఇచ్చిన ఆదేశాలను ఆమోదంపై చర్చించిన మంత్రి వర్గం
- డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ పై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ద్వారా అభివృద్ది చేసే అంశంపై చర్చ
- కడప జిల్లాకు కొండపురం గ్రామానికి చెందిన ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు .145.94 కోట్లు చెల్లింపుపై చర్చ