అమరావతి, మార్చి 5: ఎపి కేబినెట్ సమావేశం మఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించి మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుంది.
ముఖ్యమంత్రి చంద్ర బాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న ..అధికారులు,ప్రభుత్వ ఉద్యోగులకు అయిదు రోజులు ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ మంత్రి వర్గం నిర్ణయం…
ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమానికి పది కోట్ల రూపాయలు కార్పస్ నిధితో ఎక్స్ సర్వీస్-మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలిపింది.
రాజధాని అమరావతిలో ఎంప్లాయిస్ హౌసింగ్ పాలసీ జీవో నెం 34.తేదీ 24.1.19 కి సవరణ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులకు ఏపీ సిఆర్ డిఎ సూచన మేరకు ముందుగా అమరావతి అక్రెడిటెడ్ జర్నలిస్టుల మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కేటాయించిన 30ఎకరాలు రద్దు.
ఇందుకు బదులుగా జర్నలిస్టులకు 30 లక్షల చదరపు అడుగులలో మల్టీ స్టోరీడ్ అపార్టుమెంట్ల కోసం సి.ఆర్.డి.ఎ.కు 15 ఎకరాల కేటాయిస్తూ క్యాబినెట్ అమోదించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?