ఆమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీకి వాయిదా పడింది. సిఎస్ సుబ్రమణ్యం కోరిన విధంగా క్యాబినెట్ ఏజండాతో కూడిన నోట్ను సిఎంఓ కార్యాలయం మంగళవారం సాయంత్రం పంపింది. ముందుగా అనుకున్న పదవ తేదీ కాకుండా 14వ తేదీన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సిఎంఒ కార్యాలయం నుండి సిఎస్ సుబ్రమణ్యంకు నోట్ అందింది. దీనిపై ఆయన ఆయా శాఖల అధికారులకు నివేదికల కోసం పంపారు.
previous post
next post