అమరావతి, ఫిబ్రవరి 25: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం క్యాబినెట్ సమావేశం జరిగింది.
పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
క్యాబినెట్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలు…
- డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధి
- హైకోర్టులో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు…ఇళ్ల స్థలాలు
- సంక్షేమ ఫలాలు ప్రతి పేద ఇంటికి అందాలి
- కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు
- ముదిరాజ్/ముత్తరాసి/తెనుగోళ్లు బీసీ కార్పొరేషన్.
- నగరాలు/నాగవంశం బీసీ కార్పొరేషన్.
- ఏపీ కల్లుగీత/నీరగీత బీసీ కార్పొరేషన్ ఏర్పాటు
- బీసీ కార్పొరేషన్కు అపెక్స్ బాడీ ఏర్పాటు
- కార్పొరేషన్ల పరిధిలోకి రాని మిగతా 54 కులాలకు..న్యాయం చేయాలి
- విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెదబోడేపల్లిలో ఏపీఆర్ హైస్కూల్ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్
- ఇళ్లు నిర్మించుకునే పరిస్థితులో జర్నలిస్టులు లేనందున, భూమి ప్రభుత్వమే తీసుకుని ఇళ్లు కట్టించి ఇవ్వాలనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి, అవసరమైతే జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ను వాడుకోవాలని నిర్ణయం
- జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రత్యేక కేటగిరిగా నిర్ణయం
- కేబినెట్లో టేబుల్ అంశంగా సోలార్ విండ్ పాలసీకి ఆమోదం.