ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఈ రోజు (బుధవరం) ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 19 వ తేదీ నుండి 24వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహాక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది.
ఆ విభాగాల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
అలాగే సీపీఎస్ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. జీపీఎస్ అమలుపై ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి జీవోలను అధికారులు సిద్దం చేశారు. వీటిని కేబినెట్ లాంఛనంగా ఆమోదించే అవకాశం ఉంది. దీంతో పాటు మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే పకడ్బందీగా వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఆ నేపథ్యంలో దీనిపై మంత్రివర్గం చర్చించనున్నది. అదే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఇటీవల సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపైనా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపనుంది.
Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు..ఎందుకంటే..?