అమరావతి లో నేడు ఏపీ కేబినెట్ సమావేశం రెండు గంటలపాటు జరగ్గా చివరికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయమై అంతా ఒక కొలిక్కి వచ్చారు. 25 జిల్లాలతో పాటు అరకు ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న విషయం పై కమిటీ ఎన్నో తర్జనభర్జనల అనంతరం రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై పిఎస్ నేతృత్వంలో చివరికి ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
జిల్లాల ఏర్పాటులో నేతల ప్రమేయం లేకుండా కేవలం అధికారులకే పూర్తిస్థాయి బాధ్యతలను అప్పజెప్పారు. శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ శాండ్ కార్పొరేషన్ లో మాత్రం పలువురు మంత్రుల ను నియమించారు. కార్పొరేషన్లో ఆర్థిక మంత్రి సహా మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు నియమింపచబడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మార్చి 31లోగా జిల్లాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయించుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని చెప్పడ< గమనార్హం. ఇక సిఎస్ నేతృత్వంలో జరిగిన ఈ క్యాబినెట్ మీటింగ్ లో చివరికి ఏపీలో కొత్త జిల్లాల అవసరం ఎంతైనా ఉందని వారు చెప్పారు. ఇకపోతే నేతల ప్రమేయం లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటుని కేవలం అధికారుల బాధ్యతగానే ఉంచాలి అని చెప్పిన ఈ పునర్వ్యవస్థీకరణ అంశం కార్యరూపంలో ఎంత వరకు విజయవంతంగా అమలు అవుతుంది అన్న విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నెలకొంది.
మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఆమోదం తెలపడం ముందు నుండి ఖరారు అయిన విషయమే అయినా… ఒక నాలుగైదు జిల్లాల విషయంలో మాత్రమే పేర్లు అటు ఇటు గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అధికారికంగా ఏఏ కొత్త జిల్లాలు రాష్ట్రాంలో ఏర్పడనున్నాయో తెలిసే వరకూ ఈ సస్పెన్స్ తప్పదు.