ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో వివిధ విషయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులు, వాటిని ఎదుర్కోవడంపై తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో కేబినెట్ చర్చ నడిచింది.
వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఈ భేటీలో ఆమోదం తెలిపింది. అలాగే జగనన్న విద్యాకానుక పథకానికి ఆమోదం తెలిపింది. వచ్చే నెల 5 నుండి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. కడప జిల్లాలో పోలీస్ శాఖను బలోపేతం చేయడానికి ఆమోదం తెలిపింది కేబినెట్. వైఎస్సార్ సంపూర్ణ పోషకాహార అమలుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలు, శిశువులకు సంబంధించి సంపూర్ణ పోషణ అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై కూడా మంత్రి వర్గం చర్చించింది.