AP Cabinet: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. నూతన పి ఆర్ సి జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నూతన పి ఆర్ సి కి ఆమోదం తెలిపింది..
అయితే ఉద్యోగ సంఘాలకు వాస్తవ పరిస్థితి విన్నవించి బుజ్జగించేందుకు ప్రభుత్వం సంప్రదింపుల కమిటీ వెయ్యాలని నిర్ణయం తీసుకుంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ లను కమిటీలో సభ్యులుగా చేర్చారు. ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులను వివరించి వారిలో అపోహలను తొలగించేందుకు ఈ కమిటీ చర్యలు చేపడుతుంది. కాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్ల పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి టాబ్లెట్ ఆమోదముద్ర వేసింది.
అదేవిధంగా జగనన్న టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టౌన్ షిప్ లలో 20శాతం రిబేటు తో 10 శాతం ప్లాట్లు ఇవ్వాలని తీసుకుంది. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు కోసం 5 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు నగదు చెల్లింపు ఉంటుందని చెప్పారు. ఇవీ క్యాబినెట్ నిర్ణయాలు..
ఈబీసీ నేస్తం అమలుకు క్యాబినెట్ ఆమోదం
ఈనెల 25న ఈబీసీ నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం
16 వైద్య కళాశాలల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
వైద్య కళాశాలలకు రూ, 7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం
ప్రస్తుత వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 3,820 కోట్లు కేటాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాల్లో ఓటీఎస్ చెల్లింపునకు ఆమోదం
రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 5 వేల కోట్లు
ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుకు చెల్లింపు
ఉద్యోగుల నూతన పీఆర్సీకి ఆమోదం
కోవిడ్తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం
అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం
ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం
కిదాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు
విశాఖలో అదాని డేటా సెంటర్కు భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం