AP Cabinet Meeting: ఏపి కేబినెట్ భేటీ సమయం మారింది. తొలుత ఈ నెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ సర్క్యులర్ జారీ చేశారు. అయితే 7వ తేదీ ఉదయం సీఎం జగన్ కు వేరే పర్యటనలు ఉండటం వల్ల కేబినెట్ భేటీ సమయాన్ని సాయంత్రానికి మార్చినట్లు తెలుస్తుంది. ముందుగా ఖరారు చేసిన షెడ్యుల్ ప్రకారం ఈ నెల 6వ తేదీ నరసరావుపేటలో జరిగే వాలంటీర్ల సత్కార కార్యక్రమానికి జగన్ పాల్గొనాల్సి ఉంది.
AP Cabinet Meeting: 7వ తేదీ సాయంత్రం ప్రస్తుత మంత్రి వర్గ చివరి భేటీ
అయితే రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడంతో వాలంటీర్ల సత్కార కార్యక్రమం 7వ తేదీ ఉదయాన్ని మార్పు చేశారు. ఉదయం నరసరావుపేటలో జరిగే వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సాయంత్రం ప్రస్తుత మంత్రి వర్గ చివరి భేటీ జరగనుంది. కేబినెట్ భేటీలోనే పదవులు కోల్పోతున్న మంత్రుల పేర్లు వెల్లడించి వారితో రాజీనామా చేయించననున్నట్లు తెలుస్తోంది. మరుసటి రోజు 8వ తేదీ ఉదయం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయి మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారని సమాచారం. కొత్త మంత్రుల లిస్ట్ గవర్నర్ ఆమోదం కొరకు ఇచ్చి ఆమోదం తెలిపిన వెంటనే అదే రోజు వారికి సమాచారం ఇవ్వనున్నారు.
ఈ నెల 11 వ తేదీ ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారని చెబుతున్నారు. వెలగపూడిలోని సచివాలయ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మంత్రుల్లో ఇద్దరు మినహా మిగిలిన అందరినీ రాజీనామా చేయించనున్నారని తెలుస్తోంది.