అమరావతి:శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ శాఖలను కేటాయించారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు.
పిల్లి సుభాస్ చంద్రబోస్, పుష్ప శ్రీవాణి, ఆళ్ల నాని, నారాయణ స్వామి, అంజద్ బాషాలను ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు.
వైఎస్ హయాంలో కీలకమైన హోంశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. అదే మాదిరిగా నేడు సిఎం వైఎస్ జగన్ కూడా తండ్రి బాటలోనే మహిళా ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు హోంశాఖను అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రులు – వారి శాఖలు
- ధర్మాన కృష్ణదాస్ – రోడ్లు భవనాలు
- బొత్స సత్యనారాయణ – మున్సిపల్ శాఖ
- పుష్ప శ్రీవాణి – గిరిజన సంక్షేమం
- అవంతి శ్రీనివాస్ -పర్యాటక
- కురసాల కన్నబాబు – వ్యవసాయం
- పినిపె విశ్వరూప్ – సాంఘీక సంక్షేమం
- ఆళ్ల నాని – వైద్య ఆరోగ్య శాఖ
- తానేటి వనిత -మహిళా శిశు సంక్షేమం
- శ్రీరంగనాథ రాజు – గృహ నిర్మాణ శాఖ
- వెల్లంపల్లి శ్రీనివాస్ – దేవాదాయ శాఖ
- కొడాలి నాని – పౌరసరఫరాల శాఖ
- పేర్ని నాని -రవాణ, సమాచార శాఖ
- మేకతోటి సుచరిత -హోం
- బాలినేని శ్రీనివాసరెడ్డి – విద్యుత్
- ఆదిమూలపు సురేష్ – విద్యాశాఖ
- అనిల్ కుమార్ యాదవ్ – ఇరిగేషన్
- మేకపాటి గౌతం రెడ్డి – పరిశ్రమల
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పంచాయతీరాజ్
- నారాయణ స్వామి – ఎక్సైజ్
- అంజాద్ భాషా -మైనార్టీ సంక్షేమ శాఖ
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాలు
- గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
- శంకర నారాయణ – బిసి సంక్షేమ
- పిల్లి సుభాష్ చంద్రబోస్ – రెవెన్యూ
- మోపిదేవి వెంకటరమణ – పశుసంవర్థక శాఖ
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 8, 2019