కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజధానుల వ్యవహారం కీలక మలుపు తీసుకున్న విషయం తెల్సిందే. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇక ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అన్నది అధికారికమైంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాజధాని తరలింపుకు కూడా ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. పట్టుబట్టి బిల్లును పాస్ చేయించుకున్న జగన్ ఇప్పుడు వీలైనంత త్వరగా రాజధాని తరలింపు కూడా చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసమే ఆగష్టు 15న రాజధాని తరలింపుకు ముహూర్తం కుదిరింది. అదే రోజు విశాఖలో ముఖ్యమంత్రి జగన్ గారి కార్యాలయంలో పూజ కార్యక్రమం జరగనుంది. విడతల వారీగా విశాఖ కు ప్రభుత్వ కార్యాలయాలు తరాలనున్నాయి.