అమరావతి, మార్చి 4 : జనవరి 11 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికే ద్వివేది స్పష్టంచేశారు. అమరావతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫారం-7 ఆన్లైన్లో దరఖాస్తు చేసినంత మాత్రాన ఓటు తొలగించినట్లు కాదని ద్వివేది తెలిపారు. నకిలీ దరఖాస్తులపై పోలీసు కేసులు మొదలవ్వగానే దరఖాస్తులు ఆగిపోయాయని ద్వివేది అన్నారు.
ఓట్ల తొలగింపు వ్యవహారంలో పార్టీల వైఖరి సరిగాలేదని ద్వివేది అన్నారు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రకటనలు చేయటం సరికాదని ద్వివేది హితవు పలికారు. ఓట్లు ఎక్కడ తొలగించారో విమర్శలు చేసేవాళ్ళే నిరూపించాలని ద్వివేది సవాల్ విసిరారు.
ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. 18 ఏళ్ళు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటు హక్కు లేదని గుర్తించినట్లు ద్వివేది తెలిపారు. ఈసీ నిస్పక్షపాతంగా పని చేస్తుందని ద్వివేది స్పష్టం చేసారు.