అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సిఇఒ)గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిఇఒగా ఉన్న సిసోడియాను కేంద్ర ఎన్నికల సంఘం ఆకస్మికంగా బదిలీ చేసి ఆయన స్థానంగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించిన సంగతి తెలిసిందే.