AP CID: స్కీల్ డవలప్మెంట్ కార్పోరేషన్ (APSSDC) స్కామ్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ కేసులో ఏ 1 నిందితుడుగా ఉన్న అప్పటి ఎండి ఘంటా సుబ్బారావును సోమవారం అరెస్టు చేసింది. మీడియా కంటపడకుండా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో హజరుపర్చగా న్యాయస్థానం ఆయనకు 12 రోజులు రిమాండ్ విధించింది. దాంతో ఆయనను మచిలీపట్నం జైలుకు ఘంటా సుబ్బారావును తరలించారు. కోవిడ్ రిపోర్టు వచ్చిన తరువాత ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ముగ్గురుని విజయవాడ జైలుకు తరలించారు.
Read more: AP CID Case: రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు హైకోర్టులో స్వల్ప ఊరట..!!
AP CID: స్కిల్ డవలప్మెంట్ కార్పోరేషన్ లో రూ.241 కోట్ల రూపాయల కుంభకోణం
కాగా ఈ కేసులో ఏ 2 గా ఉన్న లక్ష్మీనారాయణ నివాసంలో రెండు రోజుల క్రితం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరుపుతున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురవ్వడం, ఆ వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఏపి హైకోర్టు లో లక్ష్మీనారాయణ ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన హైకోర్టు ఆయనకు 15 రోజులు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత టీడీపీ హయాంలో స్కిల్ డవలప్మెంట్ కార్పోరేషన్ లో రూ.241 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు సీఐడీ గుర్తించింది. ఈ కేసులో 26 మందిపై కేసు నమోదు చేసింది.