(కడప నుండి ‘న్యూస్ ఆర్బిట్’ బ్యూరో)
అప్కో మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు నివాసంలో సీఐడీ అధికారులు మరో మారు సోదాలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన సోదాల్లో శ్రీనివాసాలు సతీమణి పేరుతో ఉన్న బ్యాంకు లాకర్లో రెండు కేజీల బంగారం, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సమాచారం. మాజీ చైర్మన్ శ్రీనివాసులు ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
గతంలో ఆప్కోలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు చివరి వారంలో ఆయన నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అప్పటి సోదాల్లో 9కేజీల 900 గ్రాముల బంగారం, 16 కేజీల డి, 91,67,000లు నగదు సీఐడీ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటితో పాటు పది లక్షల పాత వెయ్యి రూపాయల నోట్లను, హైదరాబాద్ ఇంటిలో మరో పది లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నేడు కోర్టు అనుమతితో మరో మారు తనిఖీ చేసి లాకర్లో ఉన్న బంగారం, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.