ఏదైనా ఒక క్రైమ్ సీన్ (నేరం చోటుచేసుకున్న స్థలం) లో ఫింగర్ ప్రింట్స్ (వేలిముద్రలు) సేకరణ చాలా కీలకం. ఆ వేలిముద్రలను సేకరించి అనాలసిస్ చేయడం అనేది సినిమాల్లో చూపించినంత సులువు అయితే కాదు. అందుకు బ్యూరో వారు, లేబరేటరీ డిపార్ట్మెంట్ వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ప్రతి చిన్న డీటెయిల్ ను క్షుణ్ణంగా పరిశీలించి…. విశ్లేషించాల్సి ఉంటుంది. వారి పనితీరులోని కచ్చితత్వం ద్వారానే మెరుగైన ఫలితాలు వచ్చి చివరికి నేరస్థులు పట్టుబడేలా అవి విచారణకు చాలా విశిష్టమైన సహకారాన్ని అందిస్తాయి.
తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వారు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 2019 సంవత్సరంలో జరిగిన నేరాల తాలూకు సంఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించి దాని ద్వారా కేసులను అధిక మొత్తంలో పరిష్కరించిన డిపార్ట్మెంట్ లలో ఆంధ్ర ప్రదేశ్ సిఐడి వారు మొదటి స్థానంలో నిలిచారు. ఈ విషయం లో క్రెడిట్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ DGP సునీల్ కుమార్ ( CB CID)కే చెందాలి అంటున్నారు డిపార్ట్మెంట్ వారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సిఐడి బ్యూరో ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ 512 వేలిముద్రలను ఖచ్చితంగా సేకరించి కేసును ఒక కొలిక్కి తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. మొదటి నుంచీ తన టీం ని పర్ఫెక్ట్ గా ఫార్మ్ చేసుకోవడం దగ్గర నుంచి.. కావాలసిన వనరులు అందించడం, పెర్మిషన్ లు త్వరతిగతిన ఇప్పించడం ఈ రకంగా ఎన్నో విధాలుగా చాకచక్యం తో ఫోర్స్ మొత్తన్నీ నడిపిస్తున్న సునీల్ కుమార్ గారు తక్కువ టైమ్ లో ఈ పొజిషన్ వచ్చేలా చేయగలిగారు.
9,418 ఛాన్స్ ప్రింట్స్ విషయం లో మొదటి స్థానం రావడం గర్వించదగ్గ విషయం, ఛాన్స్ ప్రింట్స్ అనగా దొరికిన ఫింగర్ ప్రింట్స్ పాత నేరస్థులతో మ్యాచ్ అయ్యేలా ఉన్నవి లేదా కేసుని ముందుకు నడిపించేందుకు అత్యంత కీలకమైన ఫింగర్ ప్రింట్స్ ను స్వీకరించడం. ఈ ఛాన్స్ ప్రింట్స్ ను అధిక మొత్తంలో స్వీకరించడం వలన కేసుని విచారించడం, ఉన్న సాక్ష్యాల ద్వారా నేరస్థులను పట్టుకోవడం చాలా సులువు అవుతుంది.
ఒక క్రైమ్ సీన్ నుండి ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ సేకరించడం అనేది అంత సులువైన విషయం కాదు. అయితే ఈ ఛాన్స్ ప్రింట్స్ స్వీకరించే విషయంలో ఆంధ్రప్రదేశ్ 9,418 ఛాన్స్ ప్రింట్స్ తో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న కేరళ 7,687 ఛాన్స్ ప్రింట్స్ ను సేకరించింది. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం తోనే ఏపీ సిఐడి ఎంతటి విప్లవాత్మకమైన పనితీరుని కనబరిచిందో అర్థంచేసుకోవచ్చు.
ఇక 512 ఫింగర్ ప్రింట్స్ ను ఎంతో ఖచ్చితత్వంతో నేరస్తులను గుర్తించి ఏపీ సిఐడి మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఇలా వేలిముద్రలు సేకరించి ఎంతో కచ్చితత్వంతో వాటిని అనాలసిస్ చేసి కేసులు త్వరగా ఒక కొలిక్కి వచ్చేలా సహకరించే స్టాఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నట్లు ఆ రిపోర్టు తెలియజేసింది. ఇంత తక్కువ మంది వేలిముద్రల ఎక్స్పర్ట్స్ (నిపుణుల) తో కూడా ఇంతటి గొప్ప ఫలితాన్ని తీసుకొనివచ్చారు అంటే ఏపీ సిఐడి బృందం కృషికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.