ఢిల్లీ: ప్రధానిగా ఉండేందుకు ఎన్నితప్పులైనా చేస్తామనే విధంగా మోది వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు.
ఢిల్లీ ఏపి భవన్లో ఆదివారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ఉన్నంత వరకూ చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు.
ప్రధాని మోది పెద్ద నోట్లు రద్దు చేసి రెండు వేల నోటు తెచ్చారనీ దీంతో రాజకీయాలు నీచంగా మారాయని చంద్రబాబు అన్నారు.
అంబేద్కర్ స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తుందని చంద్రబాబు విమర్శించారు. దేశ ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఇది అని చంద్రబాబు అన్నారు. ఇసి వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు విమర్శించారు.