అమరావతి, ఏప్రిల్ 26 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హిమాచల్ప్రదేశ్కు కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు.
ఎన్నికలు సమయమంతా క్షణం తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు పోలింగ్ అనంతరం కూడా ఈవీఎంలపై పోరు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడిపారు. దీంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ వెళుతున్నారు.
వేసవి విడిది కోసం కుటుంబ సభ్యులతో హిమాచల్ప్రదేశ్ వెళ్లి అక్కడ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.
వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి వేసవి విడిది కోసం ఐదు రోజుల క్రితం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు.