YS Jagan: ఇటీవల జపాన్ దేశం టోక్యో నగరంలో ఒలంపిక్స్ క్రీడలు జరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఆటల పోటీలలో భారత్ కొన్ని పథకాలు సాధించడం జరిగింది. ఇక రాష్ట్రం తరపున బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్య పథకం సాధించడం తెలిసిందే. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పీవీ సింధు అంచనాల మేరకు రాణించడంతో.. ఆమెకు ఢిల్లీలో అదే రీతిలో హైదరాబాద్ లో మంత్రులు ప్రభుత్వ పెద్దలు ఘనస్వాగతం పలికారు. ఇక ఇదే తరుణంలో ఒలంపిక్స్ ఆడటానికి వెళ్లకముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిసి ఆశీస్సులు అందుకున్న పీవీ సింధు తర్వాత కాంస్య పతకం సాధించి మళ్లీ వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలపడం మాత్రమే కాక మెడల్ తో ఫోటో దిగారు.
ఆ సమయంలో పీవీ సింధుకి ప్రభుత్వం తరఫున కొంత నగదు ఇంకా అనేక బంపర్ ఆఫర్ ఇవ్వడం తెలిసిందే. అంతకుముందు విశాఖ నగరంలో బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించడానికి.. కొన్ని ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగింది. ఈ తరుణంలో త్వరలో అకాడమీ స్టార్ట్ చేయాలని పిలిసింది కి వైఎస్ జగన్ తెలిపి రాష్ట్రంలో మరింత పి.వి.సింధుల ను తయారు చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే భారత మహిళా హాకీ జట్టు కూడా ఒలంపిక్స్ లో… సత్తాచాటిన సంగతి తెలిసిందే.
చివరి దాకా వెళ్లి గెలిచే మూమెంట్ లో.. ఓడిపోయిన భారత మహిళా హాకీ జట్టు దేశ ప్రజల అభిమానులను చవిచూసింది. ఇటువంటి తరుణంలో ఆ హాకీ జట్టులో ఏపీ రాష్ట్రానికి రజిని దేశానికి చేరుకున్న తర్వాత ఏపీ సీఎం జగన్ ని కలిశారు. కుటుంబ సమేతంగా కలిసిన రజినీకి సీఎం జగన్ ప్రభుత్వం తరఫున భారీ ప్రోత్సహకాలు అందించారు. కాంస్య పతక సాధనలో జట్టు.. విజయాల్లో కీలకపాత్ర పోషించిన రజిని..కి జగన్ అభినందనలు తెలపటం జరిగింది.
అంత మాత్రమే కాక 25 లక్షల రూపాయల నగదు, కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు స్వస్థలం తిరుపతిలో 1000 గజాల నివాస స్థలం.. 40 వేల రూపాయలు ఇన్సెంటివ్ లు నెలకు అందించాలని ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వ అధికారులకు జగన్ ఆదేశించారు. ఏది ఏమైనా ఒలంపిక్స్ క్రీడా భాగంలో రాష్ట్ర ప్లేయర్లకు సీఎం జగన్.. పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందించడం పట్ల క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.