ఏపి సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు బీగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల విచారణకు సంబంధించి సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది హైకోర్టు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్ పై కేసుల విచారణ ఇకపై రోజు వారిగా జరగనుంది. అన్ని కేసుల్లో ప్రదమ నిందితుడుగా ఉన్న జగన్ విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హజరుకావాల్సి ఉంది. ఇదే విషయాన్ని సీబీఐ కోర్టు తేల్చిచెప్పింది. అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
కోమటిరెడ్డిని కూల్ చేసిన ప్రియాంక .. మునుగోడు ప్రచారానికి ఒకే
ఏపి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డి విచారణకు వ్యక్తిగత హజరు వల్ల వ్యయ ప్రయాసలు, భద్రతాపరమైన అంశాలను వివరిస్తూ సీబీఐ కోర్టు విచారణల నుండి వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. తన బదులుగా తన న్యాయవాది విచారణకు హజరవుతారనీ, అందుకు అంగీకరించాలని తన పిటిషన్ లో జగన్ అభ్యర్ధించారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. సీబీఐ కోర్టు విచారణకు జగన్ కు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇచ్చింది. జగన్ బదులుగా ఆయన న్యాయవాదిని విచారణకు అనుమతించాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జగన్ స్వయంగా ఈ కేసుల విచారణకు హజరుకాావాలని సీ బీ ఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. అయితే సీబీఐ కోర్టు తప్పనిసరిగా కోర్టుకు హజరు కావాలన్న సమయంలో మాత్రం జగన్ కోర్టు విచారణకు హజరుకావాలని హైకోర్టు తెలిపింది.
బీజేపీ కి మళ్లీ షాక్ .. వరంగల్లు బహిరంగపై సందిగ్థత.. మరో సారి హైకోర్టుకు..