అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శలు వస్తున్నా సీఎం జగన్ మాత్రం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలు అమలుకు వెనుకాడటం లేదు.
కరోనా సంక్షోభం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నవరత్న పథకాల్లో భాగంగా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ ద్వారా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వరుసగా రెండో ఏడాది అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రెండో విడత నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున రూ.194.46 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. ఈ నగదు బదిలీ మరో ఆరు నెలల తర్వాత ప్రారంభించాల్సి ఉన్నా ఇప్పుడు కరోనా కష్ట కాలంలో నేతన్నలు ఆర్ధిక ఇబ్బందుకు పడుతున్న కారణంగా వారికి ఈ సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?