(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తన మార్క్ ప్రదర్శిస్తున్న సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మరొక పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
అంగన్వాడీ ల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు బలవర్ధక ఆహారం అందించేందుకు గానూ వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ, వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పధకాలను మరి కొద్ది సేపటిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ రెండు పధకాల ద్వారా రాష్ట్రంలో 30.16లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుంది.