33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ కన్నుమూత .. ఎమ్మెల్యే పార్ధసారధిని పరామర్శించిన సీఎం జగన్

Share

వైఎస్ఆర్ సీపీ పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారది తండ్రి, మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవేళ ఉదయం కన్నుమూశారు. వారి స్వగ్రామం మొవ్వ మండలం కారకంపాడులో ఆయన అంత్యక్రియలు నిర్వహణకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆయన మచిలీపట్నం ఎంపీగా, ఒక సారి ఉయ్యూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

ap cm jagan pay tribute mla Kolusu parthasarathy father reddaiah Yadav

 

ఆయన కుమారుడు కొలుసు పార్ధసారధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్ధసారధి పితృవియోగం నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి.. వారి ఇంటికి వెళ్లి రెడ్డయ్య యాదవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పార్ధసారధి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Breaking: ట్రక్ ను ఢీకొట్టి బోల్తా పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు .. పది మంది మృతి


Share

Related posts

కోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ టాప్ హీరోయిన్..!!

sekhar

Corporate Negligence:హైదరాబాదులో మరో కార్పోరేట్ ఆసుపత్రి నిర్వాకం..! బిల్లు చెల్లించలేదని వైద్యం నిలిపివేత..!!

Srinivas Manem

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్

bharani jella