(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. పంటలు మంపునకు గురైన ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం జగన్ పరిశీలించారు. హెలికాఫ్టర్ లో సీఎం జగన్ వెంట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇతర అధికారులు ఉన్నారు.
ఇప్పటికే వరద సహాయక చర్యలపై సీఎం జగన్ మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. భారీవర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రూ.4450 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికార యంత్రాంగం ప్రాధమిక అంచనా. ఈ వివరాలను ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజురు చేయాలని కోరుతూ రెండు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పంట నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని కూడా పంపాలని సీఎం జగన్ కోరారు.