కాకినాడ జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో బలైన యువతి దేవిక (22) కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించి తన ఔదర్యాన్ని మరో సారి నిరూపించుకున్నారు. గతంలో బాధిత కుటుంబాలకు రూ.2లక్షలు, రూ.5 లక్షల పరిహారాల మంజూరుకే ఆందోళనలు చేసిన సందర్భాలు ఉండేవి. కానీ ప్రస్తుతం వైఎస్ జగన్మోహనరెడ్డి బాధిత కుటుంబాలకు వెంటనే ప్రభుత్వ సాయాన్ని ప్రకటించి విడుదల చేస్తున్నారు.
తాజాగా కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడ గ్రామంలో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు దేవిక పీక కోసి చంపేశాడు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువతి కుటుంబానికి అండగా నిలవాలని సూచిస్తూ ప్రభుత్వ సాయంగా పది లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసారు.
దేవిక తల్లిదండ్రులు నాగమణి, రాంబాబు హైదరాబాద్ లో ఉంటుండగా, దేవిక కూరాడ గ్రామంలో తన అమ్మమ్మ చంద్రమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన వెంకట సూర్యనారాయణ ప్రేమిస్తున్నానంటూ దేవిక వెంటపడుతున్నాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో స్కూటీపై వెళుతున్న ఆమెను ఛేజ్ చేసి నడి రోడ్డుపై కత్తితో గొంతు కోసి చంపేశాడు. స్థానికులు నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
ఆదాయం పెంపుపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్