తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుండి 25 వ తేదీ వరకూ ఆయన జిల్లాలో కడప, ఇడుపులపాయ, చక్రాలపేట, పులివెందులలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పులివెందులలో ఈ నెల 24వ తేదీ అపాచి పుఠ్ వేర్ కంపెనీ లెదర్ పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
25వ తేదీ స్వగ్రామం పులివెందులలో క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా కుటుంబ సమేతంగా సీఎస్ఐ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కడప లో జిల్లా వ్యాప్తంగా 1.18 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. .సీఎం కడప జిల్లా పర్యటనను పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే కార్యక్రమాలపై సమీక్షలు జరిపారు.