AP CM YS Jagan: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ సి) సివిల్ సర్వీసెస్ – 2021 ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపిఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. సివిల్స్ లో టాప్ ర్యాంకర్ గా శ్రుతి శర్మ నిలవగా, రెండవ ర్యాంక్ అంకిత అగర్వాల్, మూడవ ర్యాంక్ ను గామినీ సింగ్లా సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు జాతీయ స్థాయిలో ర్యాంక్ లు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్ కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయికి 56వ ర్యాంక్, పాణిగ్రహి కార్తీక్ కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్ కుమార్ కి 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం కు 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్ కు 117 వ ర్యాంక్, అరగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్ కుమార్ కు 151వ ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్ కుమార్ కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి 214వ ర్యాంక్ దక్కాయి. ఈ సందర్భంగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్ రెడ్డి తో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులకు అభినందనలు తెలిపారు.