YS Jagan: బాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ – 2023 లో పసిడి పతకం గెలిచిన సాత్విక్ – చిరాగ్ లను ఆయన అభినందించారు. ముఖ్యంగా ఏపికి చెందిన సాత్విక్ సాయి రాజ్ విజయాల పట్ల గర్వపడుతున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సోమవారం ట్వీట్ చేశారు.
కాగా ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సుదీర్ఘ విరామం తర్వాత భారత్ కు ఎట్టకేలకు రెండో స్వర్ణం లభించిన విషయం తెలిసిందే. 1965 లో పురుషుల సింగిల్స్ లో దినేశ్ ఖన్నా ఛాంపియన్ గా నిలవగా, 58 సంవత్సరాల తర్వాత పురుషుల డబుల్స్ లో సాత్విక్ – చిరాగ్ తమ అధ్భుత ఆటతీరుతో భారత్ పసిడి పతకం అందించారు. ఈ భారత జోడీ పరుషుల డబుల్స్ ఫైనల్స్ లో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్ – తియో ఈ యి (చైనీస్ తీపీ) జంటను ఓడించి విజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘటన సాధించిన తొలి భారతీయ జోడీగా సాత్విక్ – చిరాగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సాత్విక్ సాయి రాజ్ ఏపికి చెందిన క్రీడాకారుడు కాగా, చిరాగ్ శెట్టి మహారాష్ట్రకు చెందిన క్రీడాకారుడు.
పిల్లల తల్లిదండ్రులూ జర జాగ్రత్త .. కార్ డోర్ లాక్ అవ్వడంతో బాలిక మృతి