కరోనా వైరస్ పై పోరాటంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే టెస్టుల విషయంలో దూకుడుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇకపై మరింత వేగంగా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. కరోనా పరీక్షల్లో జాప్యం ఉండకూడదని డిసైడ్ చేసింది.
ఇక తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరోనా వైరస్ ద్వారా చనిపోయిన వారి అంత్యక్రియలకు 15,000 రూపాయల చెల్లించాలని నిర్ణయించారు. ఈమేరకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఇప్పటివరకూ దాదాపు 365 మంది చనిపోయారు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం ప్రజలను కలవరపెడుతోంది. మరోవైపు నమూనా సేకరణ కౌంటర్ల ఏర్పాటుకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం, ఈ కౌంటర్లు 24 గంటలూ పనిచేయాలని ఆదేశించింది.