AP CM YS Jagan: ఏపిలో నూతనంగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు వైఎస్ జగన్మోహనరెడ్డి మిగిలిన 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఉదయం 11 గంటలకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు.
Read More: Big Breaking: ఎయిర్ ఫోర్స్ కార్గో విమానానికి అగ్నిప్రమాదం..!!
విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పెనుకొండ, ఆదోని, నంద్యాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. దాదాపు రూ. 8వేల కోట్ల వ్యయంత ఈ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలలతో పాటు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మెడికల్ కాలేజీలో 500 పడకలు తగ్గకుండా ఏర్పాట్లు, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, డయాగ్నోస్టిక్ సర్వీసులు రానున్నాయి.
ప్రతి కాలేజీలోనూ అనుబంధ ఆసుపత్రిలో పది మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. సెంట్రలైజ్డ్ ఏసితో పాటు ఐసీయీ, ఓపిడీ రూమ్స్, అన్ని పడకలకు మెడికల్ గ్యాస్ పైపులైన్లు ఏర్పాటు చేస్తారు. అదే విధంగా ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంకులతో పాటు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఈ కళాశాలలు అన్ని 2023 చివరి నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నది. వీటి ద్వారా కొత్తగా 1850 సీట్లతో పాటు 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
నేడు సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయా జిల్లాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి నిన్నటికి రెండేళ్లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. మూడవ ఏడు ప్రారంభం రోజున 14 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన జరుగుతోంది.