ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) ఓ చిన్నారి వైద్య సాయానికి కోటి రూపాయలు మంజూరు చేసి తన దొడ్డ మనసును మరో సారి చాటుకున్నారు. ఇంతకు ముందు పాయకరావుపేట ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న సందర్భంలో ఓ మహిళ తన కుమారుడిని మానసిక వైకల్యం గురించి వివరించగా, వెంటనే స్పందించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ రూ.10వేల ఆర్ధిక సాయం అందజేయడంతో పాటు రూ.35వేల వీల్ చైర్ ఇచ్చారు. వికలాంగ పెన్షన్ మంజూరు చేశారు. తాజాగా కోనసీమ జిల్లాకు చెందిన ఓ చిన్నారి వైద్య సాయానికి ఏకంగా కోటి రూపాయలు మంజూరు చేశారు.
ఇటీవల సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమకు వెళ్లిన సమయంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి తల్లిదండ్రులు ఫ్లకార్డు ప్రదర్శిస్తూ సీఎం దృష్టిలో పడ్డారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల నుండి బాలిక అనారోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తమ కుమార్తె హనీ అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలిపారు. ఎంతో అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. ఆ చిన్నారి వైద్య చికిత్సకు అవసరమయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ కోటి రూపాయలు మంజూరు చేశారు సీఎం జగన్. దీంతో అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ల ను కొనుగోలు చేసి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో హానీ తల్లిదండ్రులకు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందజేశారు. బాధిత కుటుంబానికి నెలకు రూ.10వేల చొప్పున పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్