ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. జెండా వందనం చేసిన జగన్ సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
జెండా వందనం చేసిన జగన్ అనంతరం ప్రసంగిస్తూ స్వాతంత్ర సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్రం ప్రాణవాయువు వంటిది. ఈ మాట గాంధీజీ చెప్పారు. ప్రజాస్వామ్యం ప్రకారమే వ్యవస్థలు నడుచుకోవాలి. రాజ్యాంగపరంగా, చట్టపరంగా నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. అయితే అది ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం కనిపించట్లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ పథకాలను ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. అలాగే కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలను గుర్తిస్తూ ఏర్పాటు చేసిన శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.